డైలీ మిర్రర్ డాట్ న్యూస్,అక్టోబర్ 19, 2024:ఎంటీవీరోడీస్ డబుల్ క్రాస్ ఆడిషన్స్ హైదరాబాద్‌లో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఇది 20వ సీజన్‌ ఎపిక్ ప్రయాణానికి నాంది పలికింది. రెండు దశాబ్దాల థ్రిల్లింగ్ ఛాలెంజ్‌లు, మరపురాని క్షణాలను వేడుకగా ఆచరించుకుంటోంది. ఈ కార్యక్రమానికి రణ్‌విజయ్ హోస్ట్‌గా, గ్యాంగ్ లీడర్స్ ప్రిన్స్, నేహా, రియాలతో పాటు సరికొత్తగా వీరితో చేరిన ఎల్విష్‌తో అభిమానులలో ఉత్సాహాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్లింది.

గ్యాంగ్ లీడర్ రియా చక్రవర్తి గత సీజన్‌లో అరంగేట్రం చేసిన గ్యాంగ్ లీడర్‌గా అలరించి, ప్రేక్షకుల నుంచి చక్కని ఆదరణను అందుకున్నారు. ఎంటీవీరోడీస్ డబుల్ క్రాస్‌కు ప్రచారం చేసేందుకు తన పర్యటనలో భాగంగా హైదరాబాద్‌కు ఆమె చేరుకున్నారు. అభిమానులను ఉత్సాహంగా, చురుకుగా ఉంచుతూ సందడి చేసింది. ఐకానిక్ చార్మినార్ మార్కెట్‌లో భోజనం చేస్తూ, వీధుల్లో నడుస్తూ, మాట్లాడుతూ రియా హైదరాబాద్ సంస్కృతికి ముగ్ధురాలైంది. అభిమానులతో సమావేశమవుతూ, వారికి అభినందనలు చెబుతూ, శరత్ సిటీ క్యాపిటల్ మాల్‌కు ఆమె వెళ్లింది. అక్కడ ఆమె 1000+లక్కీ అభిమానులతో ముఖాముఖి అయ్యింది.సెల్ఫీలు తీసుకుంటూ రోడీస్ హైప్‌ను గతంలో ఎన్నడూ లేని విధంగా పెంచారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘జంప్ ది క్యూ’పాస్‌లను అదృష్టవంతులకు అందించింది. ప్రారంభం నుంచి చివరి వరకు, ఆమె హైదరాబాద్ సందర్శన అభిమానుల ప్రేమ, సంస్కృతి మరియు ప్రతి ఒక్కరినీ మాట్లాడుకునేలా చేసిన హై-ఎనర్జీని అందిస్తూ సందడి చేసింది!

మరుసటి రోజు, హోస్ట్ రణ్‌విజయ్, గ్యాంగ్ లీడర్‌లు ప్రిన్స్, నేహా, రియా,ఎల్విష్‌లతో కలిసి సూర్య ది గ్లోబల్ స్కూల్‌లో ఆడిషన్‌లను ప్రారంభించినప్పుడు వేదికపై సందడి చేసి అందరిలో ఉత్సాహాన్ని నింపారు. ఆడిషన్లకు 2000+కన్నా ఎక్కువ ఔత్సాహిక రోడీలు పూర్తి శక్తితో కనపడటంతో, ఆ వాతావరణం మొత్తం ఎలక్ట్రిక్‌గా కనిపించింది. ఈ సీజన్ షార్ట్‌లిస్ట్‌లో ఎంపిక అవుతారా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుండడంతో ఉత్కంఠ నెలకొంది.

ఫైనల్ ఎంటీవీరోడీస్ డబుల్ క్రాస్ ఆడిషన్‌లు ఇక్కడ నిర్వహిస్తారు:

అక్టోబర్ 20న పుణెనిషిగంధ లాన్స్, కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహిస్తారు.

ఈ సీజన్‌లో, దేనికీ పరిమితులు లేవు. ఎంటీవీరోడీస్ డబుల్ క్రాస్‌కు స్వాగతం – ఇక్కడ ద్రోహం అనేది గేమ్ పేరు. ఈ అక్టోబర్‌లో మీకు సమీపంలోని నగరానికి ఎంటీవీరోడీస్ డబుల్ క్రాస్ ఆడిషన్‌లు వస్తున్నాయి!