
డైలీ మిర్రర్ డాట్ న్యూస్, హైదరాబాద్, మే 17,2025: వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘23 (ఇరవై మూడు)’ నేడు థియేటర్లలో విడుదలైంది. ‘మల్లేశం’, ‘8 ఏఎం మెట్రో’ వంటి గమనించదగిన సినిమాల దర్శకుడు రాజ్ ఆర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం, చిలకలూరిపేట ఘటనను కేంద్రంగా చేసుకొని సమాజంలోని అన్యాయ వ్యవస్థపై ప్రశ్నలు వేస్తుంది.
కథ..
సుశీల (తన్మయి ఖుషి) అనే యువతిని ప్రేమించిన సాగర్ (తేజ), ఆమెను పెళ్లిచేసుకొని జీవితాన్ని గడపాలన్న ఆశతో డబ్బుల కోసం ఒక తప్పుదారి ఎంచుకుంటాడు. దాంతో ఓ బస్సుకు నిప్పంటించి 23 మంది అమాయకుల మృతికి కారణమవుతాడు. ఈ ఘోర ఘటన తర్వాత జైలుకు వెళ్లిన సాగర్, అనంతరం జరిగే పరిణామాలే ఈ చిత్ర ములకట్టు.
Read This also…Pallavi Model School, Bowenpally Celebrates 100% Success in Class X & XII Board Results!
Read This also…IndiGo Launches ‘Plan Ahead Sale’ with Big Savings on Fares and Add-Ons
నిర్మాణ విలువలు మెరిపించాయి
సినిమాలో సన్నీ కుర్రపాటి సినిమాటోగ్రఫీ, మార్క్ కె రాబిన్ సంగీతం, అనిల్ ఆలయం ఎడిటింగ్ సినిమాకు బలాన్నిచ్చాయి. విజువల్ ప్రెజంటేషన్ సహజంగా ఉంది. ముఖ్యంగా న్యాయ వ్యవస్థలో కుల, వర్గ, హోదా ప్రభావాన్ని దర్శకుడు సమర్థవంతంగా ప్రస్తావించారు.

నటీనటుల ప్రతిభ పరిపూర్ణంగా
తేజ ప్రధాన పాత్రలో బాగానే నటించగా, తన్మయి ఖుషి సాఫీగా నటించి ఆకట్టుకుంది. జైలర్గా ప్రణీత్, సైకలాజిస్టుగా ఝాన్సీ ఆకట్టుకునే నటనను ప్రదర్శించారు. ఇతర నటీనటులు తమ పాత్రల మేరకు మంచి పనితీరు కనబరిచారు.
Read This also…Airtel Unveils World’s First Real-Time Fraud Detection Solution Across Communication Platforms
తీర్పు:
సమాజంలో జరిగే అన్యాయాలపై ప్రశ్నలు వేసే చిత్రంగా 23 (ఇరవై మూడు) నిలుస్తుంది. స్లోనెస్, డాక్యుమెంటరీ ఫీల్ కొన్ని చోట్ల ఉన్నా… పవర్ఫుల్ డైలాగ్స్, మేచుర్డ్ నెరేషన్, సాంకేతికపరమైన నాణ్యత సినిమాకు బలంగా నిలిచాయి. క్రైమ్ డ్రామాల పట్ల ఆసక్తి ఉన్నవారు తప్పకుండా చూసేయొచ్చు.
డైలీ మిర్రర్ డాట్ న్యూస్,రేటింగ్: 3/5