
డైలీ మిర్రర్ డాట్ న్యూస్, జూన్ 2,2025: దక్షిణ భారతదేశంలోని క్రికెట్ ప్రేమికులకు అదిరే కొత్త వేదికగా Southern Street Premier League (SSPL) ప్రతిష్టాత్మకంగా ఆరంభమైంది. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి, గోవా రాష్ట్రాల నుంచి నిజమైన ప్రతిభను వెలికి తీయడానికి రూపొందించిన SSPL, దక్షిణభారతదేశపు ప్రథమ T10 టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ గా నిలుస్తోంది.
ఈ ఆగస్టులో, 12 శక్తివంతమైన జట్లు దేశంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని స్థాయిలో ₹3 కోట్ల బహుమతికి పోటీ పడనున్నాయి.

జూన్ 1, 2025న హైదరాబాద్ మరియు చెన్నైలో నిర్వహించిన ప్రారంభ వేడుకలో, SSPL చైర్మన్ నవాబ్జాదా మహ్మద్ ఆసిఫ్ అలీ, సెలబ్రిటీ ప్యాట్రన్ రవి మోహన్, CEO & డైరెక్టర్ ఎల్.టి. ఆనంద్ ప్రత్యేక అతిధులుగా హాజరయ్యారు. ఈ వేడుకకు ప్రముఖులు, వ్యాపారవేత్తలు, VIPలు పాల్గొన్నారు. 5 అడుగుల ఎత్తైన అద్భుతమైన ట్రోఫీ ఆవిష్కరణ, SSPL అధికారిక లోగో ,ఉత్తేజభరిత SSPL యాంతమ్ ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
భారతదేశంలో క్రికెట్ కేవలం ఆట మాత్రమే కాదు – ఇది భాషలు, ప్రాంతాలు, సంస్కృతులను కలిపే ఒక సమైక్యతా చిహ్నం. వీధి క్రికెట్లో ఆట మొదలు పెట్టి ధోనీ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాలు ఎదిగారు. ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ, SSPL వీధి క్రికెట్ కు ప్రొఫెషనల్ వేదికను అందించడంతోపాటు, యువతకు పెద్ద అవకాశం అందిస్తుంది.