
డైలీ మిర్రర్ డాట్ న్యూస్, సెప్టెంబర్ 14,2024:విశాఖపట్నం: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (EMBA) ప్రోగ్రామ్ కు సంబంధించి వింటర్ అడ్మిషన్లను ప్రకటించింది. టైమ్స్ప్రోతో ఈ భాగస్వామ్యం అధు నాతన మేనేజ్మెంట్ నైపుణ్యంతో పని చేసే నిపుణులను శక్తివంతం చేయడం, అభివృద్ధి చెందుతున్న వ్యాపార వాతావరణంలో నాయకత్వ పాత్రల కోసం వారిని సిద్ధం చేయడం వంటి వాటిపై నిబద్ధతను నొక్కి చెబుతుంది.
ఈ ప్రోగ్రామ్ అభ్యాసకులు సంస్థాగత నాయకులుగా అభివృద్ధి చెందడానికి అవసరమైన అధునాతన నిర్వహణ పద్ధ తులపై లోతైన అవగాహనతో పాటు సమగ్ర నిర్వాహక సామర్థ్యాలను పొందేందుకు, పెంపొందించుకునేందుకు వీలు కల్పిస్తుంది.

ఇది పరివర్తనాత్మక అభ్యాస అనుభవాన్ని అందిస్తుంది. వ్యూహాత్మక దృక్కోణాలను తెలుసుకునేందుకు వీలు కల్పిస్తుంది. వినూత్న ఆలోచన ధోరణులను మెరుగుపరుస్తుంది. అభ్యాసకులు ఆచరణాత్మక వ్యాపార స్థితి గతులకు సైద్ధాంతిక ఫ్రేమ్వర్క్లను వర్తింపజేయడానికి అవకాశం ఉంటుంది. నేటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్లిష్ట సవా ళ్లను పరిష్కరించడానికి వారు బాగా సన్నద్ధమయ్యేలా ఈ ప్రోగ్రామ్ చేస్తుంది.
వ్యాపార స్థితిగతులు నిరంతరం మారుతున్న ప్రపంచంలో, నిరంతర నైపుణ్యం అవసరం ఎప్పుడూ లేనంత క్లిష్టమైంది గా మారింది. 2025 నాటికి సగం మంది శ్రామిక శక్తికి రీస్కిల్లింగ్ అవసరమవుతుందని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అంచనా వేసింది. ఈ విధమైన నైపుణ్యాల పెంపుదల 2030 నాటికి అంతర్జాతీయ జిడిపికి 8.3 ట్రిలియన్ డాలర్లను పెంచే అవకాశం ఉంది.
వేగంగా మారుతున్న వ్యాపార వాతావరణం కారణంగా మేనేజర్లు తమ కెరీర్లో సంబంధితంగా ఉండటానికి నైపుణ్యా న్ని పెంచుకోవాల్సిన అవసరాన్ని కల్పిస్తోంది. ప్రతీ 10 మంది ఎగ్జిక్యూటివ్లలో 9 మంది ఎగ్జిక్యూటివ్లు సాఫ్ట్ స్కిల్స్ గతంలో కంటే చాలా ముఖ్యమని అంగీకరిస్తున్నారని లింక్డ్ఇన్ సర్వే గుర్తించింది. 2015 నుండి వివిధ ఉద్యోగాలకు సంబంధించి నైపుణ్యాలు 25% మారుతున్నాయి. 2030 నాటికి ఈ మార్పులు 65%కి చేరుకుంటాయని అంచనా. గ్లోబల్ ఎంబీఏ ఎడ్యుకేషన్ మార్కెట్ క్రమంగా పెరుగుతుందని అంచనా. 2023 నుండి 2032 వరకు సీఏజీఆర్ 15.6% గా 2032 నాటికి 83.08 బిలియన్ డాలర్ల విలువను చేరుకుంటుంది.

ఈఎంబీఏను ప్రకటించిన సందర్భంగా ఐఐఎం విశాఖపట్నం డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం. చంద్రశేఖర్ మాట్లాడుతూ, ‘‘ఐఐఎం విశాఖపట్నంలో మేం టైమ్స్ ప్రొ భాగస్వామ్యంతో ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ప్రోగ్రామ్ను అందించడానికి సంతోషిస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ వ్యూహాత్మక దూరదృష్టి, విశ్వాసంతో ఆధునిక వ్యాపార చిక్కులను నేర్పుగా తొలగిస్తూ ముందుకు వెళ్లగల నాయకులను పెంపొందించడానికి రూపొందించబడింది. ప్రపంచీకరించబడిన వ్యాపార వాతావరణంలోని సంక్లిష్టతలను అధిగమించడానికి వారికి సాధికారతనిస్తూ సరికొత్త సామర్థ్యాలను పొందేందుకు మా ప్రోగ్రామ్ వృత్తినిపుణులకు ఒక ప్రత్యేక అవకాశాన్ని అందిస్తుంది’’ అని అన్నారు.
టైమ్స్ ప్రొ సీఈఓ అనీష్ శ్రీకృష్ణ మాట్లాడుతూ, ‘‘ఐఐఎం విశాఖపట్నంతో కలసి ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ప్రోగ్రామ్ను ప్రారం భించడం పట్ల మేం సంతోషిస్తున్నాం. మా అభ్యాసకులకు ప్రతిష్టాత్మక ఐఐఎం విశాఖపట్నం ఫ్యాకల్టీ క్రింద చదవడానికి అసమానమైన అవకాశాలను అందిస్తున్నాం. అదే సమయంలో వారు విస్తృత శ్రేణి పరిశ్రమల నిపుణులతో నిమగ్నం అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ క్లిష్టమైన క్రాస్-ఫంక్షనల్ నైపుణ్యాలను అందించడమే కాకుండా తోటివారితో ఇంటరాక్షన్ల ద్వారా నిర్దిష్ట రంగాల దృక్పథాలతో అభ్యాసకులను శక్తివంతం చేస్తుంది’’ అని అన్నారు.
గత బ్యాచ్ లలో ఐటి, బిఎఫ్ఎస్ఐ, పిఎస్యులు, తయారీ, రియల్ ఎస్టేట్, మార్కెటింగ్, ఎడ్టెక్, ఆరోగ్య సంరక్షణ, కమ్యూనికేషన్స్ వంటి వివిధ రంగాల నుండి వచ్చిన, 3 నుండి 25 సంవత్సరాల వృత్తిపరమైన అనుభవాన్ని కలిగిన వారు ఈ ప్రోగ్రామ్ ను చేశారు. ఈ ప్రోగ్రామ్ 740 గంటల కఠిన అభ్యాసాన్ని కలిగి ఉంటుంది. ప్రపంచ-స్థాయి GRIHA-5 స్టార్-రేటెడ్ ఐఐఎం విశాఖపట్నం క్యాంపస్లో ఐదు రోజుల చొప్పున రెండు క్యాంపస్ మాడ్యూల్స్తో ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ కోసం అవలంబించే బోధనా విధానం ఉపన్యాసాలు, నిజ-జీవిత కేస్ స్టడీస్, క్విజ్లు, అసైన్మెంట్ల పరిపూర్ణ సమ్మేళనాన్ని కలిగి ఉంటుంది, తద్వారా సమగ్రమైన, ఆకర్షణీయమైన అభ్యాస అనుభవానికి వీలు కల్పిస్తుంది.

ఈ ప్రోగ్రామ్ టైమ్స్ ప్రొ అత్యాధునిక ఇంటరాక్టివ్ లెర్నింగ్ (IL) ప్లాట్ఫారమ్ ద్వారా నిర్వహించబడుతుంది. డైరెక్ట్-టు-డివైజ్ (D2D) మోడ్లో అందించబడుతుంది. సమగ్ర పాఠ్యప్రణాళికలో మార్కెటింగ్, ఎకనామిక్స్, ఫైనాన్స్ & అకౌం టింగ్, ఆర్గనైజేషనల్ బిహేవియర్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, హ్యూమన్ రిసోర్సెస్, స్ట్రాటజీ, ప్రొడక్షన్ అండ్ ఆపరేషన్స్, ఎంటర్ప్రెన్యూర్షిప్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, బిజినెస్ ఎథిక్స్, లా వంటి విస్తృత అంశాలను కవర్ చేస్తుంది.