డైలీ మిర్రర్ డాట్ న్యూస్,బెంగళూరు,సెప్టెంబర్ 6,2024:భారతదేశపు ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ, తమ అత్యాధునిక సాంకేతిక ఆవిష్కరణల ద్వారా ద్విచక్ర వాహన విభాగంలో భద్రత కోసం నూతన ప్రమాణాలను తీసుకువచ్చింది.
భారతదేశంలో రోడ్డు రవాణా,రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన రోడ్డు ప్రమాదాలు 2022 నివేదిక ప్రకారం, రోడ్డు ప్రమాదాలలో దాదాపు 45% ద్విచక్ర వాహనాలతో సంబంధం కలిగి వున్నాయి. ఈ కారణం చేత దేశంలో, రైడర్ భద్రతను పెంపొందించడంలో ఏథర్ నిబద్ధత గతంలో కంటే చాలా కీలకమైనది.
సాంప్రదాయకంగా, ఎయిర్బ్యాగ్లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్స్ (ABS), అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్లు (ADAS) వంటి ఫీచర్లతో రోడ్డు భద్రతలో కార్లు ముందున్నాయి. భద్రతా పరంగా ద్విచక్ర వాహన విభాగంలో ABS, అడ్వాన్స్డ్ రైడర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ARAS) వంటి భద్రతా ఆవిష్కరణలు ప్రభుత్వ ఆదేశాల తర్వాత, అదీ ఆలస్యంగా ప్రవేశపెట్టింది. ఏథర్ ఎనర్జీ అధునాతన భద్రతా లక్షణాలను నేరుగా తమ ఈవీ స్కూటర్లలోకి చేర్చడం ద్వారా ఈ కథనాన్ని మారుస్తోంది.
ఏథర్ ఈవీ లు సాఫ్ట్వేర్ అప్డేట్ల ద్వారా నిరంతరం అభివృద్ధి చెందుతాయి, రైడర్లు తాజా భద్రతా ఆవిష్కరణల నుంచి ప్రయోజనం పొందేలా చేస్తాయి. ఏథర్ సేఫ్టీ సూట్లోని ప్రత్యేక లక్షణాలలో ఒకటి స్కిడ్ కంట్రోల్ , కంకర, నీరు లేదా ఇసుక వంటి ఉపరితలాలపై స్కిడ్డింగ్ను నిరోధించడానికి మోటర్ టార్క్ను పర్యవేక్షించి , సర్దుబాటు చేసే ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్. అదనంగా, ఏథర్ ఫాల్ సేఫ్ సిస్టమ్ స్కూటర్ పతనాన్ని గుర్తిస్తే ఆటోమేటిక్గా మోటర్కు పవర్ను కట్ చేస్తుంది, ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు నిజ-సమయ భద్రతా జోక్యాలను అందించే తెలివైన వ్యవస్థలతో రూపొందించాయి. ఉదాహరణకు, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ (ESS) అధిక వేగంతో ఆకస్మిక స్టాప్ల సమయంలో ఫ్లాషింగ్ లైట్లను సక్రియం చేస్తుంది, సంభావ్య ప్రమాదం గురించి ఇతర డ్రైవర్లను హెచ్చరిస్తుంది. థెఫ్ట్ & టో డిటెక్ట్,లైవ్ లొకేషన్ షేరింగ్ వంటి సౌకర్యవంతమైన ఫీచర్లు భద్రత మరొక లేయర్ని జోడిస్తాయి.
ఈవీ సాంకేతికత స్వాభావిక ప్రయోజనాలను ఉపయోగించుకోవడం ద్వారా, ఏథర్ దాని స్కూటర్లను సురక్షితమైనవిగా మలుస్తుంది. భారతీయ రైడర్లకు అసమానమైన రక్షణ,మనశ్శాంతిని అందిస్తోంది.