
డైలీమిర్రర్ డాట్ న్యూస్, జనవరి 17, 2025: ప్రపంచ ప్రఖ్యాత సంగీత బృందం కోల్డ్ప్లే తమ మ్యూజిక్ ఆఫ్ ది స్పియర్స్ వరల్డ్ టూర్ కచేరీని భారతదేశ ప్రేక్షకులకు ప్రత్యక్షంగా అందించడానికి డిస్నీ+ హాట్స్టార్ సిద్ధమవుతోంది.
గణతంత్ర దినోత్సవ సందర్భంగా అహ్మదాబాద్లో నిర్వహించే ఈ ప్రత్యేక ప్రదర్శన, దేశ వ్యాప్తంగా ప్రతి స్క్రీన్లో ఈ అద్భుతమైన మ్యూజిక్ అనుభవాన్ని అందించనుంది.
డిస్నీ+ హాట్స్టార్ తన అధునాతన సాంకేతికతను ఉపయోగించి ఈ ప్రదర్శనను అత్యున్నత నాణ్యతతో ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. ఈ కచేరీ ఉత్సాహాన్ని, శక్తిని నేరుగా ప్రేక్షకుల వద్దకు తీసుకురావడమే కాకుండా, సజావుగా ,మరింత లీనమయ్యే అనుభవాన్ని అందిస్తోంది. ప్రదర్శనతో పాటు, ప్రత్యేక తెరవెనుక ఛాయలను చందాదారులకు చూపించేందుకు ఈ భాగస్వామ్యం ముందడుగు వేస్తోంది.

డిస్నీ+ హాట్స్టార్లో జియోస్టార్ – స్పోర్ట్స్ సీఈఓ సంజోగ్ గుప్తా మాట్లాడుతూ, “మేము వినోదంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి, ప్రేక్షకులకు అధునాతన అనుభవాలు అందించేందుకు కట్టుబడి ఉన్నాం.
కోల్డ్ప్లేతో ఈ భాగస్వామ్యం మా ప్రతిజ్ఞకు మద్దతు ఇస్తోంది. దేశవ్యాప్తంగా ప్రీమియం వినోదం అందించడమే కాకుండా, ప్రజల జీవితాల్లో ఉమ్మడి సంబురాలను పెంచడానికి ఇదొక చక్కని అవకాశం.” అని పేర్కొన్నారు.
కోల్డ్ప్లే సందేశం
కోల్డ్ప్లే ప్రధాన గాయకుడు క్రిస్ మార్టిన్ మాట్లాడుతూ, “భారతదేశంలోని మా అభిమానులకు నమస్తే! జనవరి 26న అహ్మదాబాద్లో జరిగే మా ప్రదర్శనను డిస్నీ+ హాట్స్టార్లో ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉండటం చాలా ఆనందకరం.
మీరు ఎక్కడ ఉన్నా మా సంగీతాన్ని ఆస్వాదించవచ్చు. మీ అందరితో కలిసి సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాం!” అని తెలిపారు.

కోల్డ్ప్లే మ్యూజిక్ ఆఫ్ ది స్పియర్స్ వరల్డ్ టూర్ ప్రపంచ రికార్డులను తిరగరాస్తున్న ప్రదర్శనలలో ఒకటి. ఈ టూర్ ద్వారా సంగీతం, స్థిరత్వం, సృజనాత్మకతకు సంబంధించిన ఓ ప్రత్యేక వేడుకను అందిస్తోంది.
ఈ ప్రసారం బ్రాండ్లకు కూడా వినూత్న అవకాశాలను తెస్తోంది. స్పాన్సర్షిప్, ప్రత్యేక ప్రీ-షో, పోస్ట్-కచేరీ ఎంగేజ్మెంట్లతో తమ బ్రాండ్ను సమర్థవంతంగా ప్రమోట్ చేసుకోవచ్చు.
డిజిటల్ ప్రపంచంలో వినోద అనుభవాలకు దారితీయడానికి సిస్కో భాగస్వామ్యంతో ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని నిర్వహిస్తున్నారు.