
డైలీమిర్రర్ డాట్ న్యూస్, హైదరాబాద్, మే 8, 2025: ప్రముఖ సౌందర్య సేవల సంస్థ లక్ష్మీస్ సలోన్ & అకాడమీ గురువారం హైదరాబాద్లోని కొత్తపేట, ఆర్కే పురంలో తన మొట్టమొదటి స్టోర్ను ఘనంగా ప్రారంభించింది.
ఈ ప్రారంభోత్సవ వేడుకకు ముఖ్య అతిథులుగా బీజేపీ నాయకులు సోమ రంగారెడ్డి, ఆర్కే పురం డివిజన్ కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి, కొత్తపేట డివిజన్ కార్పొరేటర్ ఎన్. పవన్ కుమార్, మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు డి. భాస్కర్ రెడ్డితో పాటు లక్ష్మీస్ సలోన్ & అకాడమీ భాగస్వాములు నగేష్, శ్రీమతి లక్ష్మి తదితరులు హాజరయ్యారు.

సెలబ్రిటీలు ప్రత్యేకమైన కస్టమర్లకు అత్యుత్తమ గ్రూమింగ్ సేవలను అందించాలనే లక్ష్యంతో ఈ సలోన్ ప్రారంభించబడింది. ఇక్కడ ట్రెండీ హెయిర్ కేర్, స్కిన్ కేర్, బాడీ కేర్, సౌందర్య సేవలతో పాటు హెయిర్ ఫారమ్లు, హెయిర్ కలరింగ్, హెయిర్ స్టైలింగ్, మానిక్యూర్, బ్రైడల్ మేకప్, ప్రత్యేకమైన హెయిర్ గ్రూమింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి.
అంతేకాకుండా, కస్టమర్ల వయస్సు, చర్మ తత్వాన్ని బట్టి వివిధ రకాల ఫేషియల్స్ను సహజ సిద్ధమైన మూలికలు, పండ్లు, గులాబీ రేకులు వంటి వాటితో అందిస్తారు. శాస్త్రీయ పద్ధతిలో చేసే స్ట్రోక్ ఫేషియల్స్ కూడా ఇక్కడి ప్రత్యేకత.
ఈ సందర్భంగా లక్ష్మీస్ సలోన్ & అకాడమీ వ్యవస్థాపకురాలు శ్రీమతి లక్ష్మి మాట్లాడుతూ, కొత్తపేటలోని ఆర్కే పురంలో తమ మొదటి శాఖను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

“సలోన్ అంటే కేవలం అందాన్ని అందించే స్థలం మాత్రమే కాదు, ఒక ప్రత్యేకమైన అనుభూతినిచ్చే ప్రదేశం. మేము మా వినియోగదారులకు అందుబాటు ధరల్లో అత్యుత్తమమైన సేవలను అందించడానికి కృషి చేస్తున్నాము” అని ఆమె అన్నారు.
ఆధునిక హంగులు, విలాసవంతమైన వాతావరణం, అద్భుతమైన నైపుణ్యం కలిగిన నిపుణులు, కస్టమర్ల సంతృప్తి, నిరంతర శిక్షణపై ప్రత్యేక దృష్టి సారించి లక్ష్మీస్ సలోన్ & అకాడమీ అందం, సంరక్షణ రంగంలో సరికొత్త ప్రమాణాలు నెలకొల్పడానికి సిద్ధంగా ఉందని నిర్వాహకులు తెలిపారు.
ఇదిలా ఉండగా, లక్ష్మీస్ సలోన్ & అకాడమీ త్వరలోనే అల్కాపురి కాలనీలో కూడా తమ తదుపరి శాఖను ప్రారంభించి, అక్కడి ప్రజలకు సైతం ప్రీమియం గ్రూమింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది.