డైలీ మిర్రర్ డాట్ న్యూస్,డిసెంబర్ 7, 2024:రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈనెల 9వ తేదీన నిర్వహించబోతున్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిని రాష్ట్రీయ బీసీ సంక్షేమం మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానించారు.

ఈ అంశంపై కేసీఆర్ ను ఆహ్వానించడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ బృందం ఎర్రవెల్లి లోని కేసీఆర్ నివాసానికి చేరుకుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ బృందాన్ని former ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు వంశిధర్ రావు తదితరులు సాదరంగా స్వాగతించారు.

తన నివాసానికి వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు కేసీఆర్ లంచ్ ఆతిథ్యమిచ్చి గౌరవించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన ఢిల్లీ కేంద్రంగా జరిగిన ఉద్యమాన్ని గుర్తు చేసుకుని, ఇరువురు నాయకులు వారి జ్ఞాపకాలను పంచుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ తో ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రజా సంబంధాల సలహాదారుడు హర్కర వేణుగోపాల్, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రోటోకాల్ డైరెక్టర్ వెంకట్రావు ,ఇతరులు కూడా ఉన్నారు.