డైలీ మిర్రర్ డాట్ న్యూస్,హైదరాబాద్, 9 నవంబర్ 2024:భారతదేశంలోని అత్యంత విశ్వసనీయ జీవిత బీమా సంస్థలలో ఒకటైన ఎస్బిఐ  లైఫ్ ఇన్సూరెన్స్, మిర్చి సహకారంతో, హైదరాబాద్‌లో  ఎస్బిఐ  లైఫ్ స్పెల్ బీ 2024 – ‘బీ స్పెల్‌బౌండ్’14వ ఎడిషన్ కోసం రీజినల్ ఫైనల్స్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది.

దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిభా వంతులైన యువ స్పెల్లర్‌లను ఒకచోట చేర్చే ఈ పోటీ ఇప్పుడు దాని తదుపరి దశకు చేరుకుంది. హైదరాబాద్ రీజినల్ ఫైనల్‌లో హైదరాబాద్ నుండి 27 పాఠశాలల నుండి 8,425 మంది విద్యార్థులకు గాను 52 మంది విద్యార్థులు ఫైనల్ లో  పాల్గొన్నారు.

హైదరాబాద్‌లోని కెన్నెడీ హై ద గ్లోబల్ స్కూల్‌కు చెందిన 9 వ తరగతి విదార్థి,  13 ఏళ్ల యశ్విన్ పచౌరి తన అత్యుత్తమ స్పెల్లింగ్ సామర్థ్యం,మేధో నైపుణ్యంతో ఎస్బిఐ  లైఫ్ స్పెల్ బీ 2024 హైదరాబాద్ రీజినల్ ఫైనల్‌ను గెలుచుకున్నాడు. అతను ఇప్పుడు ఇతర నగరాల నుండి ఎంపిక చేయబడిన విజేతలతో పోటీ పడనున్నాడు. ఈ పోటీ డిసెంబర్ 24న జరుగనుంది.

అభిషేక్ కర్ మజుందార్, రీజనల్ డైరెక్టర్ – హైదరాబాద్ రీజియన్, ఎస్బిఐ  లైఫ్ ఇన్సూరెన్స్ ఇతర గౌరవనీయ ప్రముఖుల సమక్షంలో ఫైనలిస్టులను సత్కరించారు.

ఈ సంవత్సరపు  ఎడిషన్‌లో, 30 నగరాల్లోని 500 కంటే ఎక్కువ పాఠశాలల నుండి 2 లక్షల మంది విద్యార్థులు పాల్గొంటున్నారు, ప్రతి ఒక్కరూ ‘స్పెల్‌మాస్టర్ ఆఫ్ ఇండియా 2024’ ప్రతిష్టాత్మక టైటిల్ కోసం పోటీ పడుతున్నారు.  గ్రాండ్ ఛాంపియన్ రూ. 1 లక్ష నగదు బహుమతితో పాటుగా డిస్నీల్యాండ్ హాంకాంగ్‌కు చిరస్మరణీయమైన పర్యటనను గెలుచుకుంటారు.

బ్రాండ్, కార్పొరేట్ కమ్యూనికేషన్స్ & సీఎస్ఆర్ , ఎస్బి ఐ  లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ రవీంద్ర శర్మ, మాట్లాడుతూ , “ఎస్బిఐ లైఫ్‌ వద్ద , భారతదేశ భవిష్యత్తు నాయకులకు తమ  కలలు,ఆకాంక్షలను కొనసాగించడానికి అధికారమివ్వాలని మేము కోరుకుంటున్నాము. 

ఎస్బిఐ  లైఫ్ స్పెల్ బీ 2024 పోటీ యువ ప్రతిభకు  ఎదగడానికి వేదికను అందించాలనే  మా నిబద్ధతను ఉదహరిస్తుంది. ఈ చిన్నారులు  కేవలం పోటీలో పాల్గొనేవారు మాత్రమే కాదు, మన దేశం పురోగతిని నడిపించే భవిష్యత్ ఆవిష్కర్తలు ,సృష్టికర్తలని మేము గుర్తించాము. వారి ప్రయాణంలో ఒక పాత్ర పోషించినందుకు మేము చాలా గర్వపడుతున్నాము” అని అన్నారు.