డైలీ మిర్రర్ డాట్ న్యూస్,హైదరాబాద్, డిసెంబర్ 5, 2024: భారతదేశంలో ప్రముఖ రైడ్‌షేరింగ్ సేవల ప్రదాత ఉబెర్, దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పుష్ప 2 చిత్రానికి అధికారిక మొబిలిటీ భాగస్వామిగా సహకరించడానికి ముందుకొచ్చింది.

ఈ భాగస్వామ్యంతో, ఉబెర్ వన్ సభ్యుల కోసం ప్రత్యేకమైన ప్రయోజనాలు, ఉత్సాహపూరితమైన పోటీలను అందించనుంది. ఈ క్రమంలో, 100 మంది అదృష్టవంతులైన ఉబెర్ వన్ సభ్యులకు డిసెంబర్ 5న పుష్ప 2 ప్రత్యేక ప్రదర్శనలో పాల్గొనే అవకాశం కల్పించనుంది.

అదనంగా, ఈ విజేతల్లో ఎంపికైన కొందరు పుష్ప 2 చిత్రంలో దాక్షాయణిగా తన పాత్రతో ప్రేక్షకులను మెప్పించిన అనసూయ భరద్వాజ్‌ను వ్యక్తిగతంగా కలుసుకునే అదృష్టాన్ని పొందుతారు.

హైదరాబాద్ నగరంలోని ఉబెర్ వన్ సభ్యులు ఈ ప్రత్యేక స్క్రీనింగ్ టిక్కెట్లు గెలుచుకోవడం కోసం ఇప్పటికే పుష్ నోటిఫికేషన్‌లు అందుకున్నారు. సభ్యత్వం పొందిన రైడర్‌లు లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేయబడతారు. విజేతలకు ఫోన్ లేదా ఇమెయిల్ ద్వారా సమాచారం ఇస్తారు.

ఈ భాగస్వామ్యంపై ఉబెర్ ఇండియా సౌత్ ఏషియా మార్కెటింగ్ హెడ్ అమేయ వేలంకర్ మాట్లాడుతూ,”మేము ఇటీవల ఉబెర్ వన్ మెంబర్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించాం. రైడర్లకు విశేషమైన అనుభవాలను అందించడం మా లక్ష్యం.

పుష్ప 2 సినిమా కేవలం ఓ చిత్రమే కాదు, ఓ భావోద్వేగం. అందుకే, హైదరాబాద్‌లోని మా ఉబెర్ వన్ సభ్యులకు ఈ భాగస్వామ్యంతో మరపురాని అనుభూతులను అందించాలనుకుంటున్నాం,” అని తెలియజేశారు.

ఈ భాగస్వామ్యం ద్వారా ఉబెర్, దాని రైడర్లకు ప్రాముఖ్యతనిచ్చి, ప్రతిరోజు ప్రయాణాలను మరింత స్మరణీయంగా మార్చడంలో ముందంజలో ఉంది.