డైలీమిర్రర్ డాట్ న్యూస్,డిసెంబర్ 30,2024: తెలుగు ప్రేక్షకులను ఎప్పటికప్పుడు వినోదపరుస్తున్న జీ తెలుగు, నూతన సంవత్సర వేళలో ప్రత్యేక కార్యక్రమాలతో ముందుకొచ్చింది.

2024కి ఘనంగా వీడ్కోలు చెప్పేందుకు, 2025కి ఆనందంగా స్వాగతం పలుకుతూ, డిసెంబర్ 31 రాత్రి 10 గంటలకు ‘సరిగమప పార్టీకి వేళాయెరా’ ప్రసారం చేయనుంది.

అలాగే, జనవరి 1న (బుధవారం) ప్రతిరోజు రాత్రి 8:30 గంటలకు ప్రసారమయ్యే సరికొత్త ఫిక్షన్ సీరియల్ ‘చామంతి’ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.

జీ తెలుగు నిర్వహించిన న్యూ ఇయర్ స్పెషల్ ఈవెంట్ ‘సరిగమప పార్టీకి వేళాయెరా’, సరిగమప గాయనీగాయకులు ,ప్రముఖ సీరియల్ నటీనటుల అద్భుత ప్రదర్శనలతో అలరిస్తుంది.

యాంకర్ రవి, లాస్య నిర్వహణలో సాగిన ఈ కార్యక్రమంలో, మేఘసందేశం సీరియల్ నటులు గగన్ (అభినవ్), భూమి (భూమిక), నిండునూరేళ్ల సావాసంలో అమరేంద్ర (రిచర్డ్ జోస్), అరుంధతి (పల్లవి గౌడ), భాగమతి (నిసర్గ గౌడ), చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్ నటులు మిత్ర (రఘు), లక్ష్మి (మహి గౌతమి) తదితరులు పాల్గొని పాటలు, డాన్స్, ఆటపాటలతో వినోదాన్ని పంచారు.


దివ్యాంగుల ప్రతిభను గుర్తించి వారికి ప్రోత్సాహం అందించడంలో కూడా ఈ కార్యక్రమం ప్రత్యేకతను చాటుకుంది. జీ తెలుగు, 2024కి ఆనందంగా వీడ్కోలు పలుకుతూ, 2025ను సందడి, వినోదంతో ప్రారంభించనుంది.

‘చామంతి’, పల్లెటూరి అమ్మాయి చామంతి (మేఘనా లోకేష్) జీవిత కథ ఆధారంగా నడుస్తుంది. చామంతి కుటుంబం జమీందారీ ఇంటికి సేవలందిస్తూ జీవిస్తుంది. చామంతి తండ్రి రామచంద్రయ్య (ప్రభాకర్), తల్లి మూగగా ఉంటారు.

చామంతి అక్క రోజా (ఐశ్వర్య వర్మ), ఎయిర్ హోస్టెస్‌గా పనిచేస్తూ కుటుంబంపై నిరాసక్తతను కనబరుస్తుంది.ఇదిలా ఉండగా, హర్షవర్ధన్ అనే వ్యాపారవేత్త జమీందారీ కుటుంబం సహాయంతో వాయుపుత్ర ఎయిర్లైన్స్‌ను నిర్మించాడు.

అతని వారసులు అరుణ్, ప్రేమ్. పల్లెటూరి చామంతి నగరానికి ఎలా చేరుకుంది? హర్షవర్ధన్ కుటుంబంతో ఆమెకు ఏవిధమైన సంబంధాలు ఏర్పడ్డాయి? ప్రేమ్‌తో చామంతి మధ్య ప్రేమ చిగురించిందా? ఇవన్నీ తెలుసుకోవాలంటే ‘చామంతి’ సీరియల్ తప్పక చూడండి.

నటీనటులు
మేఘనా లోకేష్, ఆశిష్ చక్రవర్తి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సీరియల్‌లో, ప్రముఖ నటులు ప్రభాకర్, మౌనిక, భార్గవ రామ్, ఐశ్వర్య, శశిధర్, శ్రియా రమేష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.