
డైలీ మిర్రర్ డాట్ న్యూస్,ముంబై,జనవరి 28, 2025:ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ అయిన హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్, భారతదేశంలో అతిపెద్ద సెంట్రల్ రికార్డ్కీపింగ్ ఏజెన్సీలలో (సీఆర్ఏ) ఒకటైన కేఫిన్ టెక్నాలజీస్ లిమిటెడ్ (KFintech)తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది.
ఈ భాగస్వామ్యం ద్వారా నేషనల్ పెన్షన్ సిస్టం (ఎన్పీఎస్) అమలును మరింత వేగవంతం చేయడానికి లక్ష్యంగా పెట్టుకుంది. హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ప్రస్తుతం 3.5 లక్షల పైగా సబ్స్క్రయిబర్స్, 2,700 కార్పొరేట్ క్లయింట్లతో విస్తృతమైన నెట్వర్క్ను కలిగి ఉంది.

ఎన్పీఎస్ వ్యవస్థలో సీఆర్ఏలు కీలక పాత్ర పోషిస్తాయి. అవి సబ్స్క్రయిబర్స్ రికార్డులను కేంద్రీకృతంగా నిర్వహించడం, పారదర్శకతను పెంచడం అకౌంట్ నిర్వహణను సులభతరం చేయడం వంటి సేవలను అందిస్తాయి. కేఫిన్ టెక్నాలజీస్ సీఆర్ఏ ప్లాట్ఫాం సబ్స్క్రయిబర్స్కు వినూత్న ఫీచర్లను అందిస్తుంది.
వీటిలో లావాదేవీల స్టేట్మెంట్లను ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు డౌన్లోడ్ చేసుకునేందుకు, చందాల విధానాలకు రియల్-టైమ్ SMS నోటిఫికేషన్లు వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంకా, పాస్వర్డ్, SMS OTP ద్వారా రెండు-దశా ధృవీకరణం, ప్రత్యేక పోర్టల్స్, వాట్సాప్ సర్వీసులు,మిస్డ్ కాల్ సదుపాయాలు కూడా ఉన్నాయి.
హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ఎండీ & సీఈవో, Mr. ధీరజ్ రెల్లి మాట్లాడుతూ, “కేఫిన్ టెక్నాలజీస్తో ఈ భాగస్వామ్యం మా సేవలను విస్తరించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ భాగస్వామ్యం ద్వారా మా సబ్స్క్రయిబర్స్, కార్పొరేట్ క్లయింట్లకు అత్యుత్తమ సాంకేతికతను అందించగలుగుతాము.

ప్రత్యేకంగా, కార్పొరేట్ ఎన్పీఎస్పై పన్ను ప్రయోజనాలు పెరిగిన నేపథ్యంలో, ఈ భాగస్వామ్యం మరింత సమయోచితంగా ఉండటం వల్ల, కార్పొరేట్ ఎన్పీఎస్పై ఆసక్తి పెరుగుతుంది. కేఫిన్ టెక్నాలజీస్ సమర్థతతో, ఆన్బోర్డింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేసి, కొత్త సబ్స్క్రయిబర్స్కి మెరుగైన అనుభవం అందించగలుగుతాము” అని చెప్పారు.
కేఫిన్ టెక్నాలజీస్ ఎండీ & సీఈవో శ్రీకాంత్ నాదెళ్ల మాట్లాడుతూ, “ఆర్థిక సేవల డిజిటలీకరణ వేగవంతం కావడం, దేశవ్యాప్తంగా పింఛను సేవలను అందుబాటులోకి తెచ్చే గొప్ప అవకాశం కల్పిస్తోంది.
హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్తో ఈ భాగస్వామ్యం ద్వారా, ఎన్పీఎస్ను మరింత విస్తరించేందుకు గల శక్తిని ఉపయోగించుకుంటాం. దీని ద్వారా దేశవ్యాప్తంగా పింఛను అందుబాటులోకి తీసుకురావడమే మా లక్ష్యం” అని అన్నారు.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ ఎన్పీఎస్ కింద పన్ను ప్రయోజనాలను 10% నుంచి 14% కి పెంచడంతో, ఈ భాగస్వామ్యం మరింత సమయోచితంగా ఉంటుంది. ప్రస్తుతం 18,700 సంస్థలు మాత్రమే కార్పొరేట్ ఎన్పీఎస్ కింద నమోదు చేసుకున్నాయి,21.6 లక్షల సబ్స్క్రయిబర్స్ ఉన్నారు. ఈ రంగంలో గణనీయమైన వృద్ధి అవకాశాలు ఉన్నాయి.