డైలీ మిర్రర్ డాట్ న్యూస్,హైదరాబాద్, 13 మార్చి 2025: భారతీయ చేనేత రంగ అభివృద్ధికి కొత్త మార్గాలను అన్వేషించేందుకు గోకూప్ లైవ్లీహుడ్స్ ఫౌండేషన్, యాక్సెస్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ సంయుక్తంగా మార్చి 11న హైదరాబాద్ బంజారా హిల్స్‌లోని తాజ్ డెక్కన్‌లో ‘వీవింగ్ ది ఫ్యూచర్ – హ్యాండ్లూమ్ కొలోక్వియం’ సదస్సును నిర్వహించారు.

చేనేత రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను సమీక్షించేందుకు, వాటికి పరిష్కార మార్గాలను కనుగొనేందుకు ఈ కార్యక్రమం విధాన నిర్ణేతలు, పరిశ్రమ నిపుణులు, నేత కార్మికులు, నేత సంస్థలను ఒకే వేదికపైకి తీసుకువచ్చింది.

Read this also…Synchrony India Recognized Among Top 50 Best Workplaces for Innovation in 2025

Read this also…Swadesh Honors Women Champions of Craft & Creative Traditions on Women’s Day

ఈ సదస్సులో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ముఖ్య అతిథిగా పాల్గొని, చేనేత రంగాభివృద్ధిలో సాంకేతికత ప్రాముఖ్యతపై ప్రసంగించారు. అలాగే, బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్, నాబార్డ్ డిజిఎం డాక్టర్ ఎంవిఎస్ఎస్ శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు (ఎంఎస్ఎంఇ & సెర్ప్) డాక్టర్ ఎం. శంకర ప్రసాద్, ఎగ్జిమ్ బ్యాంక్ రీజినల్ హెడ్ శ్రీమతి పూర్ణిమ బుసి, లీడ్ ఏంజెల్ ఇన్వెస్టర్ నాగరాజ ప్రకాశం తదితర ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

సదస్సు సందర్భంగా చేనేత రంగంలో ఇ-కామర్స్, సాంకేతికత వినియోగం, మార్కెటింగ్ వ్యూహాలు, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలు వంటి అంశాలపై discussions జరిగాయి.

ఆధునిక వినియోగదారులను ఆకర్షించేలా చేనేత ఉత్పత్తుల రూపకల్పన, విక్రయ అవకాశాలను పెంపొందించడం, కళాకారుల జీవనోపాధిని మెరుగుపరచడం వంటి ప్రాధాన్యత విషయాలపై పరిశ్రమ నిపుణులు, డిజైనర్లు, విధాన రూపకర్తలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

Read this also…Muthoot Microfin Secures e-KYC License for Seamless Digital Onboarding

ఈ సందర్భంగా యాక్సెస్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ VP సువేందు రౌట్ మాట్లాడుతూ, “చేనేత రంగంలో సుస్థిర అభివృద్ధికి నూతన దిశ చూపే చర్చలు జరిపే వేదికగా ఈ కొలోక్వియం నిలిచింది” అని తెలిపారు.

గోకూప్ వ్యవస్థాపకుడు శివ దేవిరెడ్డి మాట్లాడుతూ, “భారతదేశ నేత కార్మికులు, కళాకారులకు స్థిరమైన జీవనోపాధిని అందించేందుకు గోకూప్ ఎప్పుడూ కృషి చేస్తోంది. ఈ సదస్సు ద్వారా చేనేత రంగ ప్రముఖులను ఒక వేదికపైకి తీసుకురావడం, సవాళ్లను గుర్తించడం, పరిష్కార మార్గాలను చర్చించడం, భారతదేశ చేనేత వారసత్వాన్ని పరిరక్షించేందుకు దోహదపడే ఉద్యమాన్ని ప్రోత్సహించడమే మా లక్ష్యం” అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా గోకూప్ మార్చి 12 నుంచి 16, 2025 వరకు కళింగ కల్చరల్ హాల్‌లో ‘గోస్వదేశీ’ ప్రదర్శనను నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా 45 మందికి పైగా కళాకారులు ఇందులో పాల్గొంటున్నారు. భారతీయ చేనేత ఉత్పత్తులను ప్రదర్శించేందుకు, వినియోగదారులకు నేరుగా కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించేందుకు ఈ ప్రదర్శన ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది.