డైలీ మిర్రర్ డాట్ న్యూస్,హైదరాబాద్,డిసెంబర్ 7, 2024: ఐదో ఎడిషన్ గాడియం సబ్-జూనియర్ బ్యాడ్మింటన్ ఓపెన్ ఛాంపియన్‌షిప్-2024 గాడియo స్పోర్టోపియాలో శనివారం ప్రారంభమైంది. దేశ వ్యాప్తంగా 750 మంది యువ క్రీడాకారులు అండర్-11,అండర్-13, అండర్-15 వయో విభాగాల్లో సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్స్ లో పోటీ పడుతున్నారు.

పద్మ భూషణ్‌ పుల్లెల గోపీచంద్‌, గాడియం స్కూల్ చైర్మన్ నిత్యానంద రెడ్డి, సీఈఓ రామకృష్ణా రెడ్డి, స్కూల్ హెడ్ సుధేష్ణ ఛటర్జీ తో కలిసి ఈ టోర్నీని ప్రారంభించారు.

గోపీచంద్‌, గాడియం చైర్మన్‌ నిత్యానందరెడ్డి మధ్య జరిగిన స్నేహపూర్వక మ్యాచ్‌ ప్రారంభోత్సవానికి ఉత్సాహాన్ని నింపింది.

ఈ సందర్భగా పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ
క్రీడల్లో క్రమశిక్షణ, పట్టుదల, అభిరుచి వంటి విలువలు ముఖ్య మని అన్నారు. యువ క్రీడాకారుల్లో బ్యాడ్మింటన్ స్ఫూర్తిని పెంపొందించేలా భారీ స్థాయిలో ఈ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నందుకు గాడియం స్కూల్‌ను అభినందించారు. గాడియం స్కూల్ ఫౌండర్, డైరెక్టర్ కీర్తి రెడ్డి మాట్లాడుతూ పిల్లల అభివృద్ధిలో క్రీడల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.