డైలీ మిర్రర్ న్యూస్, జూలై 11, 2024: కమల్ హాసన్ చిత్రం ‘గుణ’ రీ-రిలీజ్‌ను మద్రాసు హైకోర్టు అడ్డుకుంది. ఈ చిత్రం కాపీరైట్‌ తనదేనంటూ ఘనశ్యామ్‌ హేమ్‌దేవ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ పి.వేల్‌మురుగన్‌ బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

మలయాళ చిత్రం మంజుమ్మల్ బాయ్స్ కు మంచి ఆదరణ లభించడంతో ఈ చిత్రాన్ని మళ్లీ విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు పిరమిడ్ ఆడియో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఎవర్‌గ్రీన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ప్రసాద్ ఫిల్మ్ లేబొరేటరీస్‌లకు నోటీసులు జారీ చేసింది.