డైలీ మిర్రర్.న్యూస్, ఆగస్టు 2,2024 : భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకుగా ఉన్నహెచ్డీఎఫ్సీ బ్యాంక్, సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల ద్వారా పెట్టుబడి అవకాశాలను ఎక్కువగా అందించే మోసపూరిత ట్రేడింగ్ ప్లాట్ఫారమ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని తన వినియోగదారులకు సూచించింది. వినియోగదారులను రక్షించేందుకు పెట్టుబడి మోసాలకు సంబంధించి ముందస్తుగా జాగృతిని, అవగాహనను పెంచడమే బ్యాంకు లక్ష్యాన్ని కలిగి ఉంది.
పెట్టుబడి మోసాలకు పాల్పడే మోసగాళ్లు సాధారణంగా స్టాక్లు, ఐపీఓలు, క్రిప్టోకరెన్సీ, బిట్కాయిన్ తదితరాలలో పెట్టుబడి పెడితే అసాధారణంగా అధిక రాబడి వస్తుందని హామీ ఇస్తారు. ఇందులో నకిలీ ఆటోమేటెడ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫారమ్లు లేదా యాప్లను సృష్టించడం ద్వారా బాధితులు చేసే పెట్టుబడులపై అధిక రాబడిని సూచించే నకిలీ డాష్బోర్డ్లను వారు చూపిస్తారు.
ఇటువంటి ప్లాట్ఫారమ్లు ఈ అధిక రాబడి పెట్టుబడి పథకాలలో చేరమని వ్యక్తులను ఆహ్వానిస్తూ సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేసుకుంటారు.వాస్తవానికి అవన్నీ మోసపూరితమైనవే. వంచకులు సాధారణంగా సామాజిక ఇంజనీరింగ్ వ్యూహాల ద్వారా ప్రజలను దోచుకుంటారు.
అయితే, జాగ్రత్తగా ఉండటం, తగిన శ్రద్ధ తీసుకున్న అనంతరమే లావాదేవీలు చేసుకోవడం ద్వారా మోసగాళ్ల బారిన పడకుండా తప్పించుకునేందుకు అవకాశం ఉంటుంది.
ఇటువంటి మోసాలపై హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ ఇంటెలిజెన్స్ అండ్ కంట్రోల్ ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షుడు మనీష్ అగర్వాల్ హెచ్చరిస్తూ, “మేము పెట్టుబడి మోసాల కేసుల్లో వృద్ధిని చూస్తున్నాము. వాటి గురించి విస్తృత అవగాహన, జ్ఞానాన్ని, జాగృతి కల్పించేందుకు వినియోగదారులు సమస్యల బారిన పడకుండా సహాయపడాలని కోరుకుంటున్నాము.
తద్వారా వినియోగదారులు ఈ మోసపూరిత పథకాల బారిన పడకుండా ఉండగలరు. ప్రభుత్వం, బ్యాంకులు,నియంత్రణ సంస్థలు ఈ మోసాలను అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నప్పుడు, చట్టవిరుద్ధమైన పథకాల బారిన పడకుండా ఉండటంలో వ్యక్తిగత అప్రమత్తత,అవగాహన చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి’’ అని వివరించారు.
పెట్టుబడి మోసాల నుంచి రక్షించుకోవడానికి చిట్కాలు..
• పెట్టుబడి పెట్టే ముందు శ్రద్ధ వహించండి: పెట్టుబడిని అందించే కంపెనీ లేదా వ్యక్తి, వారి ట్రాక్ రికార్డ్,చట్టబద్ధత గురించి సరైన పరిశోధన చేయండి. రిజిస్టర్డ్ బ్రోకర్ల ద్వారా మాత్రమే పెట్టుబడి పెట్టండి.
• పెట్టుబడి అధిక రాబడిని అందిస్తోంది: తక్కువ రిస్క్తో అసాధారణంగా అధిక రాబడిని వాగ్దానం చేసే అయాచిత పెట్టుబడి అవకాశాల గురించి జాగ్రత్త వహించండి
• ఆన్లైన్ ,భౌతిక ఉనికి: పెట్టుబడిని ఆహ్వానించిన సంస్థ, అధికారిక వెబ్సైట్, చెల్లుబాటు అయ్యే సంప్రదింపుల నంబరు,భౌతిక చిరునామాను కలిగి ఉందని నిర్ధారించుకోండి.
• సెన్స్ ఆఫ్ అర్జెన్సీ: పరిమిత సమయం లేదా ప్రత్యేకమైన పెట్టుబడి అవకాశం క్లెయిమ్తో ఒత్తిడికి గురికావద్దు. ఈ వ్యూహాలు బాధితులను త్వరగా పని చేయమని ఒత్తిడి చేయడం. క్షుణ్ణంగా పరిశోధన చేయకుండా నిరోధించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.
• రెడ్ ఫ్లాగ్లు: హామీ ఇవ్వబడిన రాబడి, పెట్టుబడి వ్యూహాలలో పారదర్శకత లేకపోవడం లేదా పెట్టుబడి గురించి వివరణాత్మక సమాచారాన్ని అందించడానికి నిరాకరించడం వంటి సాధారణ రెడ్ ఫ్లాగ్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
• అనుమానిత స్కామ్లపై ఫిర్యాదు చేయండి: www.sancharsaathi.gov.inలోని చక్షు పోర్టల్లో ఏదైనా అనుమానాస్పద కాల్/సందేశంపై ఫిర్యాదు చేయండి.
ఒక వ్యక్తి ఏదైనా ఆన్లైన్ మోసానికి గురైన సందర్భంలో, చెల్లింపు ఛానెల్ను బ్లాక్ చేసేందుకు అనధికారిక లావాదేవీలను వెంటనే బ్యాంక్కి తెలియజేయాలి. అంటే, భవిష్యత్తులో జరిగే నష్టాల నుంచి రక్షించుకునేందుకు కార్డ్లు/యూపీఐ/నెట్ బ్యాంకింగ్లను బ్లాక్ చేయించుకోవాలి. వినియోగదారులు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) ప్రారంభించిన 1930 హెల్ప్లైన్ నంబర్కు కాల్ చేయడం ద్వారా ఫిర్యాదును దాఖలు చేయవచ్చు. అలాగే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ https://www.cybercrime.gov.inలో ఫిర్యాదును దాఖలు చేయాలి.