
డైలీ మిర్రర్ డాట్ న్యూస్, జనవరి 27,2025: భారత్, ఇండొనేషియా మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు, అసోసియేషన్ ఆఫ్ మ్యుచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (AMFI) ,అసోసియాసి మేనేజర్ ఇన్వెస్టాసి ఇండొనేషియా (AMII) 2025 జనవరి 25న ఒక అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకున్నాయి.
ఈ భాగస్వామ్యం ద్వారా ఇరు దేశాలు తమ ఉత్తమ ఆర్థిక విధానాలను, పరిశ్రమ ప్రమాణాలను,మార్కెట్ వ్యూహాలను పంచుకునేందుకు సహకరించగలవు.
ఇండొనేషియా అధ్యక్షుడు పర్యటన సందర్భంగా, 12 మంది ఇండొనేషియా మ్యుచువల్ ఫండ్ పరిశ్రమ ముఖ్య సీఈవోలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ భాగస్వామ్యం ఇరు దేశాల మధ్య పెట్టుబడుల నిర్వహణ పరిశ్రమలో మంచి విధానాలు, ప్రమాణాలు, ఆర్థిక అక్షరాస్యత ,అవగాహన పెంచేందుకు దోహదపడుతుంది.

AMFI ,AMII ఈ MoU ద్వారా వర్క్షాప్లు, పరిశోధనలు, సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలు నిర్వహించి, ఇన్వెస్టర్లకు అవగాహన కల్పించేందుకు, వారిని సాధికారత కల్పించేందుకు చర్యలు చేపడతాయి. అలాగే, ప్రస్తుత గవర్నెన్స్ ప్రమాణాలు, నియంత్రణ వ్యవస్థలు, డేటా అనలిటిక్స్, ఉత్పత్తి ఆవిష్కరణలు,రిస్క్ మేనేజ్మెంట్ గురించి అవగాహన పెంచే వర్కింగ్ గ్రూప్లు కూడా ఏర్పాటు చేస్తారు.
ఈ MoU చర్చలు, పరిశ్రమలో అవగాహన పెంపొందించేందుకు, ప్రయోజనాలను పంచుకునేందుకు, పరిశ్రమ నైపుణ్యాలను మెరుగుపర్చేందుకు, తద్వారా ప్రస్తుతమున్న పెట్టుబడుల వ్యవస్థలను అంతర్జాతీయంగా అనుసంధానించేందుకు దోహదపడతాయి.
ఈ భాగస్వామ్యం భారత్ ,ఇండొనేషియా మధ్య పెట్టుబడుల నిర్వహణ రంగంలో ఒక కొత్త దారిని తొలగించేందుకు,2047 నాటికి వికసిత భారతదేశ లక్ష్యాన్ని, 2045 నాటికి సంపన్న ఎకానమీగా ఎదగాలన్న ఇండొనేషియా లక్ష్యాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించగలదని AMFI చైర్మన్ నవనీత్ మునోట్ తెలిపారు.

ఇండొనేషియా AMII చైర్మన్ హనీఫ్ మాంతిక్ కూడా ఈ భాగస్వామ్యం వల్ల గ్లోబల్ సౌత్లో ఆర్థిక సహకారం బలపడుతుందని అన్నారు.