డైలీ మిర్రర్ డాట్ న్యూస్,జనవరి 28, 2025:ప్రఖ్యాత చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌, ఆశీర్వాద్ సినిమాస్‌ ప్రై.లి బ్యానర్స్‌పై పృథ్వీరాజ్ సుకుమార‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిస్తున్న భారీ చిత్రం ‘L2 ఇ ఎంపురాన్’ టీజర్‌ విడుదలైంది.

2019లో బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించిన ‘లూసిఫ‌ర్’ సినిమా సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మార్చి 27న తెలుగు, మలయాళ, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.

ఈ చిత్రంలో ‘ది కంప్లీట్ యాక్టర్’ మోహన్ లాల్ టైటిల్ పాత్రలో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్‌ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు.

మోహన్ లాల్‌, పృథ్వీరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా ఇది. లూసిఫ‌ర్, బ్రో డాడీ చిత్రాల తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల మధ్య భారీ అంచనాలను నెలకొల్పింది.

టీజర్ లాంచ్‌ ఈవెంట్‌లో మంజు వారియర్ మాట్లాడుతూ, “ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్లో నేను చేసిన సినిమాలను గణించలేనంతగా ఉన్నాయి. ‘లూసిఫ‌ర్’లో నా పాత్ర నా కెరీర్లో అద్భుతంగా నిలిచింది. ఈ సీక్వెల్‌ కూడా ఆడియెన్స్‌కి అద్భుత అనుభవాన్ని ఇచ్చేలా ఉంటుంది,” అని చెప్పారు.

టోవినో థామస్ మాట్లాడుతూ, “నా పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తుందని పృథ్వీరాజ్‌ నాతో చెప్పారు. ‘ఎంపురాన్’పై భారీ అంచనాలు ఉన్నాయి. లలెట్టాన్‌తో స్క్రీన్‌ పంచుకోవడం నిజంగా అదృష్టం,” అని చెప్పారు.

దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ అన్నారు, “ఈ చిత్రంతో మలయాళ సినీ పరిశ్రమలోకి లైకా ప్రొడక్షన్స్‌ ఎంట్రీ ఇస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను మా సోదరుడు, నిర్మాత ఆంటోనీ పెరుంబవూర్ మొదటి నుండి మద్దతు అందిస్తున్నారు. మోహన్ లాల్ గారు లేకపోతే ఈ సినిమా సాధ్యపడేది కాదు.”

మోహన్ లాల్‌ మాట్లాడుతూ, “పృథ్వీరాజ్‌ గారు ‘యాక్సిడెంటల్ డైరెక్టర్’ అని చెప్పారు, కానీ ఆయన భారతదేశపు ఉత్తమ దర్శకుల్లో ఒకరని నేను విశ్వసిస్తున్నాను. ఈ సినిమా షూటింగ్ సమయంలో చాలా సవాళ్లను ఎదుర్కొన్నాం.

ఈ చిత్రాన్ని నేను ఇప్పటికే చూసాను, పృథ్వీరాజ్ తన 100% ఇచ్చారు. ఈ చిత్రం మార్చి 27న థియేటర్లలో రానుంది. ఇది మలయాళ సినిమాకు ల్యాండ్‌మార్క్‌గా నిలుస్తుంది,” అని అన్నారు.