డైలీ మిర్రర్ డాట్ న్యూస్,26 జనవరి 2025 : భారతదేశపు ప్రముఖ బాత్‌వేర్ బ్రాండ్‌లలో ఒకటైన హింద్‌వేర్ లిమిటెడ్, తన శానిటరీ వేర్, కుళాయిలు,టైల్స్ వ్యాపారాల్లో అభివృద్ధికి కొత్త దశను చేరుకోవడంలో నాయకత్వం వహించేందుకు నిరుపమ్ సహాయ్‌ను కొత్త సీఈఓగా నియమించింది.

నిరుపమ్ సహాయ్కు విభిన్న రంగాల్లో విస్తృతమైన అనుభవం, వ్యాపార వృద్ధి మరియు లాభదాయకత సాధనలో అపారమైన నైపుణ్యం ఉంది. హింద్‌వేర్‌లో చేరడానికి ముందు, డిక్సన్ టెక్నాలజీస్ వద్ద లైటింగ్ సొల్యూషన్స్ బిజినెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. తన కెరీర్‌లో ఫిలిప్స్ లైటింగ్, జీఈ క్యాపిటల్, వర్ల్‌పూల్, ఏషియన్ పెయింట్స్ వంటి సంస్థల్లో కీలక పదవులను నిర్వహించారు. అంతేకాదు, రెక్సామ్ డిక్సన్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, జీఈ మనీ ఫైనాన్షియల్ సర్వీసెస్ బోర్డుల్లో ఆయన అందించిన నాయకత్వం విశేషంగా ఉంది.

హింద్‌వేర్ భవిష్యత్ అభివృద్ధికి..

ఈ సందర్భంలో, హింద్‌వేర్ లిమిటెడ్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ సోమానీ మాట్లాడుతూ..”నిరుపమ్ సహాయ్ గారు తమ అనుభవంతో ఆవిష్కరణలపై దృష్టి సారించే తత్వంతో హింద్‌వేర్ వ్యాపార అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారని మేము నమ్ముతు న్నాము. బ్రాండ్ విశ్వసనీయతను మరింత బలోపేతం చేస్తారని ఆశిస్తున్నాము.”

వినియోగదారుల అవసరాలపై దృష్టి..

నిరుపమ్ సహాయ్ మాట్లాడుతూ..”హింద్‌వేర్ వంటి ఐకానిక్ బ్రాండ్‌లో చేరడం నాకు గౌరవంగా భావిస్తున్నాను. నాణ్యత, ఆవిష్కరణల వారసత్వంతో ఉన్న హింద్‌వేర్ భవిష్యత్ వృద్ధికి మంచి పునాదిని అందిస్తోంది. వినియోగదారుల అవసరాలను తీర్చడంలో ముందుగా ఆలోచించే విధానాన్ని అనుసరిస్తా.” అని తెలిపారు.

విద్యా ప్రాప్తి

నిరుపమ్ ఢిల్లీ సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుండి బిఎ (ఎకనామిక్స్)ఎన్‌ఎమ్‌ఐఎమ్‌ఎస్ (ముంబై) నుండి మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ పూర్తిచేశారు. అంతేకాదు, వార్టన్ స్కూల్‌లో అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ (AMP)ను కూడా పూర్తిచేశారు.