డైలీ మిర్రర్ డాట్ న్యూస్,అహ్మదాబాద్, మార్చి 13, 2025: ప్రూడెంట్ కార్పొరేట్ అడ్వైజరీ సర్వీసెస్ లిమిటెడ్ (ప్రూడెంట్) ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ షా తన వ్యక్తిగత వాటా నుంచి రూ.34 కోట్ల విలువైన 1,75,000 ఈక్విటీ షేర్లను దాదాపు 650 మంది ఉద్యోగులు, అనుబంధ సంస్థల సిబ్బంది, ఇంటి పనివారు, డ్రైవర్లకు బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించారు.

ఇది కూడా చదవండి…సామ్‌సంగ్ గెలాక్సీ బుక్5 సిరీస్ పిసిల విడుదల

ఇది కూడా చదవండి…“వీవింగ్ ది ఫ్యూచర్ – హ్యాండ్లూమ్ కొలోక్వియం సదస్సు విజయవంతంగా ముగిసింది”

వ్యాపారంలో 25 ఏళ్ల ప్రయాణాన్ని గుర్తుగా ఈ షేర్లను అందించనుండగా, లబ్ధిదారులపై ఎలాంటి షరతులు లేకుండా ఈ బహుమతిని ఇస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు SEBI సహా ఇతర నియంత్రణ సంస్థల అనుమతులు ప్రూడెంట్ కంపెనీ ఇప్పటికే పొందింది.

ఈ సందర్భంగా సంజయ్ షా మాట్లాడుతూ, “ఇది కేవలం షేర్ల బహుమతి కాదు. నా ప్రయాణంలో నన్ను నమ్మి, నాతో కలిసి కృషి చేసిన సహచరులకు నా హృదయపూర్వక కృతజ్ఞత. వారి నిబద్ధత, విశ్వాసమే మన విజయానికి పునాదిగా నిలిచాయి. మనం కలసి మరిన్ని విజయాలను సాధించాల్సిన సమయం వచ్చింది” అని అన్నారు.

Read this also…Synchrony India Recognized Among Top 50 Best Workplaces for Innovation in 2025

Read this also…Swadesh Honors Women Champions of Craft & Creative Traditions on Women’s Day

ఈ లావాదేవీకి కాటలిస్ట్ అడ్వైజర్స్ సలహాదారుగా వ్యవహరించగా, అవసరమైన అనుమతుల కోసం SEBIకు ప్రతిపాదనలు సమర్పించింది.