డైలీ మిర్రర్ డాట్ న్యూస్, జనవరి 27,2025: భారతదేశంలో ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ అయిన ప్యూర్ ఈవీ, తమ X ప్లాట్‌ఫాంనకు గణనీయమైన అప్‌గ్రేడ్ అయిన X ప్లాట్‌ఫాం 3.0ను ఆవిష్కరించింది.

ఈ కొత్త ప్లాట్‌ఫాం, ఆధునిక ఏఐ టెక్నాలజీ ఆధారంగా రూపొందించినది, ఇది వాహనం పనితీరు, కనెక్టివిటీ ,రైడర్ సౌకర్యాన్ని మెరుగుపర్చేందుకు సమర్థవంతమైన ఫీచర్లను అందిస్తుంది.

X ప్లాట్‌ఫాం 3.0లో ప్రత్యేకమైన ఫీచర్‌గా “థ్రిల్ మోడ్” పరిచయం చేయనుంది. ఇది వాహన టార్క్‌ను పెంచి, పనితీరును 25% మెరుగుపరుస్తుంది, తద్వారా రైడర్‌కు ఉత్తేజకరమైన అనుభూతిని అందిస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాల పనితీరులో కొత్త ప్రమాణాలను ఏర్పరచడంలో ఈ ఫీచర్ కీలక పాత్ర పోషిస్తుంది.

ఈ సందర్భంగా, ప్యూర్ ఈవీ వ్యవస్థాపకుడు,ఎండీ డా. నిశాంత్ దొంగారి మాట్లాడుతూ, “X ప్లాట్‌ఫాం 3.0 ఆవిష్కరణతో, అధునాతన ఏఐ టెక్నాలజీలను అనుసంధించడం ద్వారా ఎలక్ట్రిక్ మొబిలిటీ విప్లవానికి మేము కొత్త దశను ప్రారంభిస్తున్నాము.

ఈ ప్లాట్‌ఫాం మా ప్రత్యేక ఆవిష్కరణ, ఇది భారతదేశం నుంచి ప్రపంచ మార్కెట్‌కి మార్గం చూపిస్తుంది. మా వాహనాలను కేవలం రవాణా సాధనాలుగా కాకుండా, తెలివైన, కనెక్టెడ్ డివైజ్‌లుగా పరిగణిస్తూ, మా కస్టమర్లకు అసాధారణమైన అనుభూతిని అందించే లక్ష్యంతో అభివృద్ధి చేశాము” అన్నారు.

ఈ ప్లాట్‌ఫాం మరొక విశిష్ట ఫీచర్ “ప్రెడిక్టివ్ ఏఐ” అనేది, ఇది రైడర్ ధోరణిని అర్థం చేసుకుని, వేర్వేరు రైడింగ్ పరిస్థితులకు అనుగుణంగా పనిచేస్తుంది. “చికిత్స కన్నా నివారణ మేలు” అనే సూత్రాన్ని అనుసరించడంతో, వాహనం సమర్థవంతంగా పని చేస్తూ, సమస్యలు తలెత్తడానికి ముందే వాటిని గుర్తించి పరిష్కరించే విధంగా పనిచేస్తుంది. క్లౌడ్ ఏఐతో సహా, ఈ ప్లాట్‌ఫాం ఓవర్-ది-ఎయిర్ అప్‌డేట్‌లు,అప్‌గ్రేడ్లను అందిస్తుంది.

“నెక్ట్స్-జనరేషన్ టీఎఫ్‌టీ డ్యాష్‌బోర్డ్” కూడా ఈ ప్లాట్‌ఫాం కీలక భాగంగా ఉంది. ఇది iOS, ఆండ్రాయిడ్ డివైజ్‌లతో సులభంగా కనెక్ట్ అవుతుంది. ఈ ఆధునిక డ్యాష్‌బోర్డు, రియల్-టైమ్ నావిగేషన్, బ్యాటరీ హెల్త్ అప్‌డేట్‌లు, రేంజి అంచనాలతో పాటు మరిన్ని స్మార్ట్ ఫీచర్లను అందిస్తుంది.

X ప్లాట్‌ఫాం 3.0 యూజర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి డిజైన్ చేయనుంది. బ్యాటరీ హెల్త్, రేంజి వంటి కీలక అంశాలకు సంబంధించిన రియల్-టైమ్ అప్‌డేట్‌లు యూజర్‌కు సరళమైన అనుభవాన్ని అందిస్తాయి. ఈ ప్లాట్‌ఫాం, ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమలో కొత్త ప్రమాణాలు నెలకొల్పడంలో కీలకమైన పురోగతిగా నిలుస్తుంది.

X ప్లాట్‌ఫాం 3.0ను ప్రాథమికంగా ప్యూర్ ఈవీ ప్రీమియం మోడల్స్ అయిన ePluto 7G Max, eTryst X మోడల్స్‌లో అందుబాటులో ఉంటుంది. 2025 సంవత్సరాంత నాటికి, ఈ ప్లాట్‌ఫాం మిగతా మోడల్స్‌లో కూడా అందుబాటులోకి రాబోతుంది. X ప్లాట్‌ఫాం 3.0 ఆవిష్కరణ ప్యూర్ ఈవీ లక్ష్యానికి అనుగుణంగా, ఎలక్ట్రిక్ వాహనాలను రోజువారీ జీవితంలో భాగం చేసే సుస్థిరమైన తెలివైన మొబిలిటీ సొల్యూషన్స్‌ను అందించే దిశగా ఒక అడుగును వేసింది.