డైలీ మిర్రర్ డాట్ న్యూస్,హైదరాబాద్, జూన్ 14, 2025: తూముకుంటలోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ 2025, జూన్ 14న వన మహోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా జరిపింది.

ఈ వేడుక ద్వారా పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన జీవనం వంటి అంశాల ప్రాముఖ్యతను బలపరిచింది. ఈ కార్యక్రమానికి జీహెచ్ఎంసీ అర్బన్ బయోడైవర్సిటీ వింగ్ అదనపు కమిషనర్ శ్రీమతి వి.వి.ఎల్. సుభద్రా దేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఆమె సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ, పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం పెంచాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. అలాగే చెట్లను నాటడం వంటి చిన్న ప్రయత్నాలు భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన వాతావరణానికి ఎలా దారితీస్తాయో హైలైట్ చేశారు.


స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీమతి విజయలక్ష్మి సాగర్ మాట్లడుతూ, అన్ని పల్లవి గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లలో చేపట్టిన వివిధ హరిత కార్యక్రమాలు, క్రమం తప్పకుండా మొక్కలు నాటడం వంటి కార్యక్రమాల గురించి ప్రస్తావించారు.


ఈ వేడుకలో భాగంగా పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు, సిబ్బందికి సుమారు 500 మొక్కలను పంపిణీ చేసింది స్కూల్ యాజమాన్యం. ప్రకృతిని రక్షించడానికి, సమాజంలో పర్యావరణ అవగాహనను వ్యాప్తి చేయడానికి ప్రతిజ్ఞతో చేశారు.


ఈ వేడుకకు మరింత ఆనందాన్ని ఇస్తూ, పాఠశాలలో ఫాదర్స్ డే వేడుకలు కూడా ఉత్సాహంగా జరిగాయి. తండ్రులు, పిల్లల కోసం వివిధ రకాల ఆకర్షణీయమైన ఆటలు, సరదా కార్యకలాపాలు నిర్వహించారు.

బంధాలను బలోపేతం చేయడం, జ్ఞాపకాలను సృష్టించడం జరిగింది. ఈ వేడుకలో ముఖ్యాంశాలుగా ర్యాంప్ వాక్, జుంబా సెషన్, ఉత్సాహభరితమైన ట్యాప్ టు డ్యాన్స్ విభాగం ఉన్నాయి. ఇందులో అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ ఆటలు, పోటీల విజేతలను బహుమతులతో సత్కరించడంతో వేడుకలు ముగిశాయి.