డైలీ మిర్రర్ డాట్ న్యూస్,నేషనల్,ఫిబ్రవరి 6,2025: ఎజాక్స్ ఇంజినీరింగ్ లిమిటెడ్ తన ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో)ను 2025 ఫిబ్రవరి 10 (సోమవారం) నుంచి ప్రారంభించనుంది. ఈ ఐపీవో 2025 ఫిబ్రవరి 12 (బుధవారం) నాటికి ముగిసే అవకాశం ఉంది. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం బిడ్డింగ్ 2025 ఫిబ్రవరి 7 (శుక్రవారం)కి నిర్ణయించనుంది.

ఈ ఐపీవోలో భాగంగా షేర్ల ధర శ్రేణి రూ. 599 నుంచి రూ. 629 వరకు ఉండనుంది. కనీసం 23 ఈక్విటీ షేర్లకు బిడ్లు వేయవచ్చు. ఒక్కో షేరు ముఖ విలువ రూ. 1గా ఉంటుందని ఎజాక్స్ సంస్థ తెలిపింది. ఎంప్లాయీ రిజర్వేషన్ పోర్షన్ కింద అర్హత గల ఉద్యోగులకు ప్రత్యేకంగా షేర్లు కేటాయించబడతాయి.

ఈ ఐపీవోలో 2,01,80,446 షేర్లు ఆఫర్ ఫర్ సేల్ (OFS) విధానంలో విక్రయించబడతాయి. ఇందులో క్రిష్ణస్వామి విజయ్ 17,16,102 షేర్లను, కల్యాణి విజయ్ 17,16,102 షేర్లను, జేకబ్ జితెన్ జాన్ 22,88,136 షేర్లను, జేకబ్ హాన్సెన్ ఫ్యామిలీ ట్రస్ట్ 55,93,221 షేర్లను, సుసీ జాన్ 14,30,085 షేర్లను, కేదారా క్యాపిటల్ ఫండ్ II ఎల్ఎల్పీ 74,36,800 షేర్లను విక్రయించనున్నారు.

ఈ ఐపీవోకు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ లిమిటెడ్, సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, జేఎం ఫైనాన్షియల్ లిమిటెడ్, నువామా వెల్త్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్, ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.