డైలీ మిర్రర్ డాట్ న్యూస్,హైదరాబాద్,మార్చి 1,2025: దేశంలో ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థల్లో ఒకటైన ప్యూర్ ఈవీ వినియోగదారుల నమ్మకాన్ని మరింత బలపర్చేందుకు ‘ప్యూర్ పర్ఫెక్ట్ 10’ రిఫరల్ ప్రోగ్రాంను ప్రవేశపెట్టింది.

ఈ ప్రత్యేక ఆఫర్, శివరాత్రి, హోలీ, ఉగాది, రంజాన్ వంటి పండుగల సందర్భాన్ని పురస్కరించుకుని కస్టమర్లకు మరింత లబ్ధి చేకూర్చేందుకు రూపొందించనుంది. దేశవ్యాప్తంగా ఈవీ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు, కస్టమర్లకు ప్రత్యేకమైన క్యాష్‌బ్యాక్ రివార్డులు అందించేందుకు ఈ ప్రణాళిక దోహదపడనుంది.

Read this also..PURE EV Unveils ‘PURE Perfect 10’ Referral Program with Exciting Cashback Rewards

ఇది కూడా చదవండి..యాక్సిస్ నిఫ్టీ AAA బాండ్ ఫండ్స్ – మార్చ్ 2028 ఆవిష్కరణ..

Read this also..Axis Mutual Fund Launches AXIS Nifty AAA Bond Financial Services – Mar 2028 Index Fund..

రూ.40,000 వరకు క్యాష్‌బ్యాక్ రివార్డులు

ప్యూర్ పర్ఫెక్ట్ 10 రిఫరల్ ప్రోగ్రాం ద్వారా, ప్రస్తుతం ప్యూర్ ఈవీ వాహనం కలిగిన వినియోగదారులు, అలాగే 2025 మార్చి 31లోగా కొత్తగా కొనుగోలు చేసే వినియోగదారులు ఈ ఆఫర్‌ను పొందవచ్చు. స్టాక్ ఉన్నంతవరకు ఈ స్కీం అందుబాటులో ఉంటుంది. ఈ ప్రోగ్రాం కింద, స్నేహితులను లేదా కుటుంబ సభ్యులను ప్యూర్ ఈవీ కొనుగోలుకు రిఫర్ చేస్తే రూ.40,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందే అవకాశం ఉంటుంది.

రిఫరల్ కోడ్ ద్వారా క్యాష్‌బ్యాక్

ప్రస్తుత, కొత్త వినియోగదారులందరికీ వారి రిజిస్టర్డ్ వాట్సాప్ నంబర్‌కి 10 ప్రత్యేకమైన రిఫరల్ కోడ్‌లు పంపించబడతాయి. రిఫర్ చేసిన వారు ప్యూర్ ఈవీ వాహనం కొనుగోలు చేస్తే, ప్రతి విజయవంతమైన లావాదేవీకి రిఫర్ చేసిన వ్యక్తికి రూ.4,000 క్యాష్‌బ్యాక్ వోచర్ లభిస్తుంది. గరిష్టంగా 10 మంది వరకు కొత్త కొనుగోలుదారులను రిఫర్ చేసే అవకాశం ఉంటుంది.

వోచర్ల వినియోగం – మరిన్ని ప్రయోజనాలు

కస్టమర్లు ఈ క్యాష్‌బ్యాక్ వోచర్లను భవిష్యత్తులో వాహన సర్వీసింగ్, స్పేర్ పార్ట్స్, అప్‌గ్రేడ్స్, వాహన ఎక్స్చేంజ్, బ్యాటరీ మార్పిడి, లేదా కొత్త వాహనం కొనుగోలుకు నేరుగా డిస్కౌంట్‌గా ఉపయోగించుకోవచ్చు.

Read this also...Zydus Lifesciences Launches India’s First Flu Vaccine for New Influenza Strain (Southern Hemisphere 2025)

Read this also...A Grand Celebration of Telugu Cinema at Red Lorry Film Festival: Parallel Verse in Hyderabad

Read this also...Mindspace Eco Run 2025: Fitness for You, Sustainability for All..

ప్యూర్ ఈవీ వ్యవస్థాపకుడు స్పందన

ఈ నూతన రిఫరల్ ప్రోగ్రాం గురించి ప్యూర్ ఈవీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో రోహిత్ వదేరా మాట్లాడుతూ –”మా వినియోగదారుల విశ్వాసమే మా ప్రధాన బలం. పండుగ సీజన్‌లో వారికి అదనపు ఆనందాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ ప్రోగ్రాం తీసుకురావడం జరిగింది. వినియోగదారులు తమ సన్నిహితులకు ప్యూర్ ఈవీ గురించి తెలియజేస్తూ, ఆకర్షణీయమైన క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలు పొందొచ్చు.

దీని ద్వారా ఈవీ వినియోగం పెరిగి, పర్యావరణహిత మొబిలిటీ లక్ష్య సాధనంలో ముందడుగు పడుతుంది. ఇది మా వినియోగదారుల సమూహాన్ని మరింత బలపరిచి, ఈవీ విపణిలో విస్తృత మార్పులకు దోహదపడుతుందని మేము నమ్ముతున్నాం” అని తెలిపారు.

ప్యూర్ ఈవీ ఈ కొత్త ప్రోగ్రామ్ ద్వారా కస్టమర్లతో మరింత మైత్రీ సంబంధాలను ఏర్పరచుకోవాలని, ఈవీ ప్రయాణాన్ని మరింత అందరికీ చేరువ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.