డైలీ మిర్రర్ డాట్ న్యూస్, ఇండియా,సెప్టెంబర్ 4,2024: సౌదీ జాతీయ పర్యాటక బ్రాండ్, ‘సౌదీ వెల్‌కమ్ టు అరేబియా’ భారతీయ మార్కెట్ కోసం తమ మొట్టమొదటి సమగ్ర వినియోగదారు ప్రచారం ‘స్పెక్టాక్యులర్ సౌదీ’- ను ప్రారంభించింది. పురాతన కథలు, ఆధునిక అద్భుతాల ఆకర్షణీయమైన సమ్మేళనంతో, ఈ ప్రచారం సౌదీ గురించిన అన్ని అంచనాలను మించిపోయిన రీతిలో వుంది.

దేశవ్యాప్తంగా ఇంగ్లీషులో ప్రసారం చేయబడుతున్న’స్పెక్టాక్యులర్ సౌదీ’ ప్రచారం సౌదీలోని బంగారు ఇసుక తిన్నెలు, సహజమైన జలాలు, అంతులేని ఆకాశంలో దేశంలోని ఐకానిక్ ప్రకృతి దృశ్యాలు, అనుభవాలను వెల్లడిస్తూ వీక్షకులను లీనమయ్యే ప్రయాణంలోకి తీసుకెళుతుంది.

ఈ ప్రచార విజువల్స్ సౌదీని అద్భుతమైన గమ్యస్థానంగా మారుస్తూ అద్భుతాలను జీవితానికి తీసుకువస్తుంది. దిరియా అట్-తురైఫ్, పురాతన మట్టి-ఇటుక నిర్మాణం మరియు ఎర్ర సముద్రం సహజమైన జలాల నుంచి జెడ్డాలోని అల్ బలాద్ చారిత్రాత్మక వీధులు, హెగ్రా, అల్యూలాలోని గంభీరమైన నబాటియన్ సమాధుల వరకు జీవం పోసింది. అనేక విధాలుగా భారతీయ ఆతిథ్యంతో ప్రతిధ్వనించే సౌదీ బహిరంగ స్వాగతించే సంస్కృతిని గుర్తించడం చేసే ఈ ప్రచారం భారతీయ సంస్కృతితో సౌదీకి ఉన్న సన్నిహిత సంబంధాన్ని మరింత సుస్థిరం చేస్తుంది.

ఇది అన్వేషించని వాటిని అన్వేషించడానికి, సంస్కృతి, వారసత్వంలో పాతుకుపోయిన ఐకానిక్ అనుభవాల కోసం అన్వేషణలో ఉన్న జంటలు, కుటుంబాలు వ్యక్తులను ఆహ్వానిస్తుంది. ఇది ఒక అద్భుతమైన సౌదీ కథను వివరిస్తుంది, ఇది వారసత్వం, చరిత్ర, ఆధునిక అద్భుతాలతో నిండి ఉంది, అదే సమయంలో రాబోయే భారతీయ ప్రయాణికులను మరపురాని ఆవిష్కరణ యాత్రను ప్రారంభించమని ప్రోత్సహిస్తుంది.

ఈ ప్రచారంపై సౌదీ టూరిజం అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ అల్హసన్ అల్దబ్బాగ్ మాట్లాడుతూ, “భారతీయ ప్రయాణికులు చాలా కాలంగా ప్రామాణికమైన, విశిష్టమైన అనుభవాల పట్ల విపరీతమైన ఆసక్తిని చూపుతున్నారు. వారు కొత్త గమ్యస్థానాలు, సంస్కృతులు, రుచులను అన్వేషించడానికి ఆసక్తిని కలిగి ఉన్నారు. సౌదీ ఇప్పుడు అదే అందిస్తోంది. సౌదీ ఎనిమిది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో మూడు దిరియా, అల్ బలాద్ , అల్ ఉలా వంటి ప్రతిష్టాత్మక గమ్యస్థానాలతో, వారు సహస్రాబ్దాల నాటి చరిత్రలో నడవగలరు. తమకు అనుకూలంగా మార్చిన ప్యాకేజీలతో ప్రపంచ స్థాయి సంస్కృతి, సాహసం, వంటకాలను ఆస్వాదించవచ్చు.

మా వారసత్వంలో ప్రధాన భాగమైన సౌదీ అరేబియా స్వాగతాన్ని భారతీయ సంస్కృతికి అంతర్లీనంగా ఉన్న అనుభూతిని భారతీయులు అనుభవించేలా చేయటానికి మేము సంతోషిస్తున్నాము. భారతదేశం మా హృదయాలలో చాలా ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంది. 2030 నాటికి భారతదేశాన్ని అగ్రగామి సోర్స్ మార్కెట్‌గా మార్చడానికి మేము కట్టుబడి ఉన్నాము. 2023 లోనే 1.6 మిలియన్ల మంది భారతీయులు సౌదీని సందర్శించారు. అరేబియా హృదయాన్ని నిజంగా ఆస్వాదించడానికి భారతీయ సందర్శకులను స్వాగతిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము..” అని అన్నారు.

గత సంవత్సరంతో పోలిస్తే భారతదేశం నుండి విశ్రాంతి సందర్శనలలో 240% పెరుగుదల కనిపించింది. 330కి పైగా డైరెక్ట్ వీక్లీ విమానాలు 8 ఎయిర్‌లైన్ ఆపరేటర్‌లతో సౌదీని సందర్శించడం అత్యంత సులభం. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ లేదా ఏదైనా స్కెంజెన్ దేశం నుంచి చెల్లుబాటు అయ్యే పర్యాటక లేదా వ్యాపార వీసాను కలిగి ఉన్న భారతీయులు, ప్రవేశానికి సంబంధించిన స్టాంపు రుజువుతో సౌదీ అంతర్జాతీయ విమానాశ్రయాలకు చేరుకున్న తర్వాత ఈ వీసాకు అర్హులు.

పైన పేర్కొన్న ప్రమాణాల ప్రకారం అర్హత లేని వారు భారతదేశం లోని11 తషీర్ కేంద్రాల ద్వారా వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం, https://www.visitsaudi.com/en/plan-your-trip/visa-regulationsని సందర్శించండి, ఇది అన్ని సౌదీ వీసా అవసరాలకు ఏకీకృత కేంద్రంగా నిలుస్తుంది. భారతీయ ప్రయాణికులు స్టాప్‌ఓవర్ వీసా కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు, ఇది 96 గంటల వరకు చెల్లుబాటు అవుతుంది. నామమాత్రపు రుసుముతో సౌదియా ఎయిర్‌లైన్, ఫ్లైనాస్ వెబ్‌సైట్‌లో 90 రోజుల ముందుగానే పొందవచ్చు.

అరేబియా హృదయాన్ని అన్వేషించ డానికి https://www.visitsaudi.com/en/campaigns/indiaని సందర్శించండి. భారతదేశంలోని 12 వాణిజ్య భాగస్వాముల నుంచి ప్రత్యేకమైన ప్యాకేజీలు, ఆఫర్‌లకు యాక్సెస్‌తో మీ తదుపరి విహారయాత్రను బుక్ చేసుకోండి.