
డైలీమిర్రర్ డాట్ న్యూస్,ఇండియా,జనవరి 15, 2025: భారతదేశంలో అగ్రగామి వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన సామ్సంగ్, ఈ రోజు నుంచి తన తదుపరి గెలాక్సీ ఎస్ సిరీస్ స్మార్ట్ఫోన్ను వినియోగదారులు ముందస్తుగా రిజర్వ్ చేసుకోవచ్చని ప్రకటించింది.
ఈ సిరీస్ మొబైల్ ఎఐలో కొత్త అధ్యాయాన్ని ఆవిష్కరిస్తుంది, ఇది వినియోగదారుల జీవితంలో ప్రతి క్షణంలో సౌలభ్యాన్ని తెచ్చే ప్రీమియం గెలాక్సీ ఆవిష్కరణలను అందిస్తుంది.

వినియోగదారులు Samsung.com, సామ్సంగ్ ఎక్స్క్లూజివ్ స్టోర్లు, భారతదేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆన్లైన్,ఆఫ్లైన్ రిటైల్ స్టోర్లలో రూ. 2000 టోకెన్ చెల్లించి ఫ్లాగ్షిప్ గెలాక్సీ ఎస్ సిరీస్ను ముందస్తుగా రిజర్వ్ చేసుకోవచ్చు.
ప్రీ-రిజర్వ్ చేసిన కస్టమర్లు, కొత్త గెలాక్సీ ఎస్ సిరీస్ పరికరాలను కొనుగోలు చేస్తే రూ. 5000 వరకు ప్రయోజనాలను పొందగలుగుతారు.
గెలాక్సీ ఎఐ తదుపరి పరిణామాన్ని సామ్సంగ్ అందించనుంది, ఇది వినియోగదారుల ప్రతిరోజు ప్రపంచంతో సంభాషించే విధానాన్ని మారుస్తుంది.

ఈ కొత్త గెలాక్సీ ఎస్ సిరీస్ మరింత ఎఐ ఆధారిత అనుభవాలను అందించి, మరోసారి సామ్సంగ్ గెలాక్సీ సిరీస్ వాణిజ్య విజయాన్ని పటిష్టపరచగలుగుతుంది. ఈ సిరీస్ను జనవరి 22న కాలిఫోర్నియాలోని శాన్ జోస్లో జరిగే “గెలాక్సీ అన్ప్యాక్డ్” ఈవెంట్లో ఆవిష్కరించనుంది.